అల్లరి నరేష్ ఆలోచన అదుర్స్ కదూ!..
కరోనా ఎఫెక్ట్ : ‘నాంది’ సినిమా యూనిట్లోని 50 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున సాయం ప్రకటించిన అల్లరి నరేష్..
కరోనా ఎఫెక్ట్ : ‘నాంది’ సినిమా యూనిట్లోని 50 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున సాయం ప్రకటించిన అల్లరి నరేష్..
తన ‘నాంది’ సినిమా కోసం పని చేస్తున్న 50 మంది కార్మికులకు తలా ఒక్కొక్కరికి 10 వేల సాయం ప్రకటించిన హీరో అల్లరి నరేష్, చిత్ర నిర్మాత వేగేశ్న సతీష్. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిస్తూ.. stay Home and Stay Safe అంటూ పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధికి (రెండు తెలుగు రాష్ట్రాలు) విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో యువ నటుడు అల్లరి నరేష్, తను నటిస్తున్న ‘నాంది’ చిత్ర బృందానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. నిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి రోజువారి వేతనానికి పనిచేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ : ‘‘కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నేను, నిర్మాత సతీష్ వేగేశ్న గారు కలిసి మా నాంది టీమ్లో వివిధ శాఖలలో పని చేస్తున్న వారికి పది వేలు చొప్పున ఇద్దామని డిసైడ్ అయ్యాం.
నాకేదో క్రెడిట్ రావాలని ఈ వీడియో చేయడం లేదు. నన్ను ఇష్టపడే వాళ్లు ఓ ఐదు, పది మందిని అయినా ఫాలో అవుతారని ఆశతో చేస్తున్నాను. అలాగే చాలామంది తమ ఇళ్లల్లో పనివాళ్లను రావద్దని చెప్పారట.. మంచిది.. కానీ వాళ్ల జీతాలు మాత్రం కట్ చేయకండి. వాళ్ళకదే జీవనాధారం’’ అంటూ వీడియో విడుదల చేసాడు అల్లరి నరేష్.
Hero @allarinaresh & producer #SatishVegesna
decided to donate 10k each for 50+ daily wage workers working for #Naandhi movie. All they asking is to stay Home and Stay Safe! ?@SV2Ent @brahmakadali @RajeshDanda_@priyadarshi_i#CoronavirusLockdown #Covid_19 pic.twitter.com/sjhlyeVVNI— Vamsi Shekar (@UrsVamsiShekar) March 26, 2020