ఆ పేద రైతు వల్లే మేమీ స్థాయిలో ఉన్నాం..
తెలుగు చలన చిత్ర సీమలో పేరెన్నదగ్గ హాస్య నటుల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య ముందు వరసులో ఉంటారు. ఎన్నో చిత్రాల్లో తనదైన అభినయంతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు. ఆయన 2004లో జూలై 31న పరమపదించారు. అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రియులు, ప్రముఖులు ఆయన్ని సోషల్ మీడియా వేదికగా స్మరించుకుంటున్నారు.
అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ఇదే రోజు ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆరోజు నాకింకా గుర్తుంది. ఆరోజు కంటే ఆయనేంటో, ఆయన గొప్పతనమేంటో ఈరోజు నాకు ఇంకా బాగా తెలుసు. నేను జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల కంటే, ఆయన ఎఫర్ట్స్, ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సమస్యలకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలపై ఓ పేద రైతుకున్న ప్యాషన్ కారణంగానే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నాం’’.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు బన్నీ.
I remember this day when he left us . I know more about him now than on that day. The more I experience many things in life the more I connect to his efforts , struggles and journey. We all are here today in this position because of this poor farmers passion for cinema ?? pic.twitter.com/eoREJPY3Xr
— Allu Arjun (@alluarjun) July 31, 2020