BiggBoss 4 telugu : బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లపై కౌశల్ కామెంట్స్
మునపటి సీజన్లలా బిగ్ బాస్ 4 ఆసక్తిగా సాగడం లేదనే మాట వినిపిస్తోంది.. చూసే టీవీ ప్రేక్షకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 4వ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ షో అంతా చప్పగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి..
బిగ్ బాస్ను ఫుల్ ఎంటర్ టైన్ గా మార్చేందుకు మరో ముగ్గురు హౌస్ లోకి రాబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.. బిగ్ బాస్ 4వ సీజన్పై అప్పటి బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ స్పందించారు..
ఈ సీజన్ కంటెస్టెంట్లపై కౌశల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.. నాలుగో సీజన్ అంచనాలకు తగినట్టుగా కంటెస్టెంట్ల ఎంపిక జరగలేదన్నాడు. కరోనా దెబ్బతో చాలామంది ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు వచ్చేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి కారణం కావొచ్చునని అన్నాడు..
హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎలా ఉంటారో తాను ఏమీ చెప్పలేనన్నాడు.. గంగవ్వను ఎంపిక చేయడాన్ని కౌశల్ విశేషమన్నారు. అవ్వ వయసు వచ్చేసరికి అందరం రిటైర్మెంట్ అంటుంటారు.. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణ పల్లెటూరు నుంచి బామ్మ బిగ్బాస్ షోలోకి రావడం అసాధారణ మన్నాడు. గంగవ్వ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చెప్పాడు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బిగ్బాస్ చూసేవారి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చి ఉంటారని చెప్పుకొచ్చాడు..
ఫిజికల్ టాస్క్లతోనే కంటెస్టెంట్లు ఫైనల్కు వస్తారనుకోనని చెప్పాడు. రెండో సీజన్లో గీతామాధురి ఫిజికల్ టాస్క్లో పెద్దగా కష్టపడలేదని అయినా ఆమె ఫైనల్ వరకు చేరుకుందని అన్నాడు. ఈ లెక్కన గంగవ్వ 10 వారాల కన్నా ఎక్కువే హౌస్లో ఉండే అవకాశం ఉందని కౌశల్ అభిప్రాయపడ్డాడు. ప్రతి చిన్నదానికి సూర్యకిరణ్ తనదే కరెక్ట్ అంటూ అతిగా మాట్లాడుతున్నాడు..
టీవీలో ఎక్కువసేపు కనిపిస్తామని కొందరు కంటెస్టెంట్లు అనుకోవచ్చు.. ప్రతిసారి అలా జరగదన్నాడు. ఎవరినైనా టార్గెట్ చేసినా అందుకు మూల్యం తప్పదన్నాడు. కంటెస్టెంట్లకు అప్పుడే ఫ్యాన్స్ క్లబ్లు మొదలయ్యాయని చెప్పాడు. ఏది ఏమైనా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం ర్యాలీ తీస్తూ పోరాడిన కౌశల్ ఆర్మీ మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ కౌశల్ ముగించాడు..