‘ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేకపోతున్నాం’.. బాలుకు సినీ ప్రముఖుల నివాళి..
SP Balasubramanyam – Celebrities Tribute: ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 01:4 నిమిషాలకు కన్నుమూసినట్లుగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.
బాలు మరణవార్త వినగానే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి. సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. బాలు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేస్తున్నారు. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు అర్పిస్తున్నారు.
చిత్ర, ఏ.ఆర్. రెహమాన్, హరిహరన్, మోహన్ లాల్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, మోహన్ బాబు, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, రవితేజ, నిఖిల్, రామోజీ రావు, విజయశాంతి, రాజమౌళి, రామ్, ఆర్.మాధవన్, జగపతి బాబు, అల్లరి నరేష్, శర్వానంద్, గుణశేఖర్, అజయ్ దేవ్గన్, సల్మాన్ ఖాన్, బోని కపూర్, కొరటాల శివ, సుమన్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి, శంకర్, లింగుస్వామి, జిబ్రాన్, థమన్, దేవిశ్రీప్రసాద్, మారుతి తదితరులు బాలు గారికి సంతాపం తెలియచేశారు.
Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020
Unable to process the fact that #SPBalasubramaniam garu is no more. Nothing will ever come close to that soulful voice of his. Rest in peace sir. Your legacy will live on. Heartfelt condolences and strength to the family ?
— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2020
Extremely sad to hear the news of SP Balasubramaniam Garu’s passing. We have lost a legend today. I’ve had the privilege to work with him in some of my best movies like Prema and Pavitra Bandham. Your legacy will live on Sir!
My heartfelt condolences to the family. RIP? #RIPSPB pic.twitter.com/NjjcdSg2l1— Venkatesh Daggubati (@VenkyMama) September 25, 2020
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే pic.twitter.com/HGbIfa0yyH
— Jr NTR (@tarak9999) September 25, 2020