కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత

కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత

Comedian Pandu

comedian Pandu:ప్రముఖ తమిళ హాస్యనటుడు పాండు కోవిడ్ కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సారాలు, వారంరోజుల కిందట పాండు తోపాటు ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన కన్నుమూశారు. పాండు భార్య ఐసియులో చికిత్స పొందుతున్నారు. అయితే తన భర్త చనిపోయారన్న విషయం ఆమెకు తెలియదు.

చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం పెంచుకున్న పాండు కమెడియన్ గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. పాండు 1970 లో జైశంకర్-ముత్తురామన్ నటించిన మనావన్ తో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఘిల్లీ, కదల్ కొట్టై, పోక్కిరి , ఎజాయిన్ సిరిపిల్ చిత్రాలలో నటించి మెప్పించారు. ‘ఇంద నీలై మరుమ్’ ఆయన నటించిన చివరి చిత్రం. పాండు మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.

కాగా పాండు ‘క్యాపిటల్ లెటర్స్’ అనే డిజైన్ కంపెనీని నడుపుతున్నారు. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎడిఎంకె), తమిళనాడు పర్యాటక చిహ్నం ఐకానిక్ జెండాను పాండు రూపొందించారని చెబుతారు.