Dhanush – Aishwarya : విడాకుల తర్వాత పిల్లల కోసం మొదటిసారి కలిసిన ధనుష్ – ఐశ్వర్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

ధనుష్ ఐశ్వర్యలకు యాత్ర, లింగ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. యాత్ర స్కూల్ లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ..............

Dhanush – Aishwarya : విడాకుల తర్వాత పిల్లల కోసం మొదటిసారి కలిసిన ధనుష్ – ఐశ్వర్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Dhanush and Aishwarya met first time after divorce

Dhanush – Aishwarya :  కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడిపోయిన తర్వాత అందరి భార్య భర్తల్లా అసలు మాట్లాడుకోకుండా, గొడవలతోనో, ఒకరి మీద ఒకరు నెగిటివ్ గా చెప్పడం లాంటివి చేయకుండా ఇద్దరూ ఫ్రెండ్స్ లానే ఉంటున్నారు. ఇది గతంలోనే ప్రూవ్ చేశారు వీరిద్దరూ. విడాకుల తర్వాత ఐశ్వర్య ఓ ప్రైవేట్ సాంగ్ డైరెక్షన్ చేస్తే ఆ సాంగ్ ని షేర్ చేసి మరీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు ధనుష్. తాజాగా పిల్లల కోసం విడాకుల తర్వాత మొదటిసారి కలిశారు ఈ మాజీ కపుల్.

ధనుష్ ఐశ్వర్యలకు యాత్ర, లింగ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. యాత్ర స్కూల్ లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సందర్భంలో వారిద్దరూ మాట్లాడుకున్నారు కూడా. మొదటి సారి విడాకుల తర్వాత వీరిద్దరూ ఇలా కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

SSMB28: మహేష్ బాబు ఆ రిస్క్ చేయడా..?

ఇక ఐశ్వర్య తన కొడుకు ఫోటోను తీస్తున్నట్టు ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”ఈ రోజు చాలా బాగా మొదలయ్యేయింది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు” అంటూ పోస్ట్ చేసింది. ఇక ధనుష్, పిల్లలతో కలిసి దిగిన ఫోటోని కూడా తన స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినా ఇలా ఫ్రెండ్స్ లా ఉంటూ, పిల్లల కోసం కలుస్తూ ఉండటాన్ని చూసి విడిపోయినా వీరిలా ఉండాలి అని నెటిజన్లు ధనుష్ ఐశ్వర్య పై కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini)