రూ.100 కోట్ల ధనుష్ ‘అసురన్’
తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన ‘అసురన్’ తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా.. రీసెంట్గా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. వి. క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ‘అసురన్’లో ధనుష్.. రాజదేవన్, కాళీగా ద్విపాత్రాభినయం చేశాడు.. అతని నటన తమిళ తంబీలను బాగా ఆకట్టుకుంటోంది.
రూ.16 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా.. ట్రైలర్ రిలీజైన అనంతరం జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్తోనే నిర్మాతలు దాదాపు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఇక ఇప్పుడు థ్రియేటికల్ కలెక్షన్స్తో పాటు శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ ద్వారా సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు సేఫ్ జోన్లోకి రావడమే కాకుండా మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా ధనుష్ మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.
Read Also : సంతానం ‘డిక్కీలోనా’ సినిమాలో హర్భజన్ సింగ్
ధనుష్, వెట్రి మారన్ల కాబోలో వచ్చిన నాలుగో సినిమా ‘అసురన్’.. మలయాళ నటి మంజు వారియర్ అతనికి జోడీగా నటించింది. ప్రకాష్ రాజ్, పశుపతి, యోగిబాబు, తలైవాసల్ విజయ్, బాలాజీ శక్తివేల్, ఆడుగలం నరేన్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా : వేల్రాజ్, ఎడిటింగ్ : వివేక్ హర్షన్, సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్.