దిల్రాజు పెద్ద మనసు: అనాథలకు నేనున్నా అంటూ అండగా..
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్గా దిల్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు సత్యనారాయణ ఏడాది క్రితం చనిపోగా.. అతని భార్య అనురాధ ఇటీవలే ప్రాణాలు విడిచారు. దీంతో ముగ్గురు పిల్లలు అనాధలవగా.. తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి తన చెల్లి, తమ్ముడిని చూసుకుంటున్నాడు.
దీనికి సంబంధించిన కథనం బయటకు రాగా.. నటుడు సోనూసూద్ వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.ముగ్గురు చిన్నారులు ఇక ఎంతమాత్రం అనాథలు కాదని, వారి బాధ్యత తనదే నంటూ ట్విటర్ వేదికగా ప్రకటించారు. వారిని మహారాష్ట్రలోని నాసిక్కు తీసుకువచ్చి ఓ ఆశ్రమంలో ఉంచుతానని వెల్లడించారు.
అయితే ఇదే విషయమై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం చలించిపోయారు. ఆ ముగ్గురిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వారి బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరకు వెళ్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.