Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీ పాల్గొనే............
Chiranjeevi : ‘ఆజాదీ కా అమృతోత్సవ్’లో భాగంగా అల్లూరి జయంతి వేడుకల్ని కేంద్ర ప్రభుత్వం భారీగా నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించనున్నారు. భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి చిరంజీవి కూడా పాల్గొనబోతున్నారు.
అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఈ క్రమంలోనే నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి రాజమండ్రి ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. దీంతో రాజమండ్రి ఎయిర్పోర్టు బయట మెగా అబిమానులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చిరంజీవిని సత్కరించారు. చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు. చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం వెళ్తున్నారు.