కలువ కళ్ల కాజల్ వ్యాక్స్ స్టాచ్యూ – రేపే రిబ్బన్ కటింగ్
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఫిబ్రవరి 5న కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు..
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఫిబ్రవరి 5న కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు..
ప్రముఖుల మైనపు విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటీనటుల విగ్రహాల్ని ఒకేచోట ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఇప్పటికే బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలూ ఉన్నాయి.
ఈ లిస్ట్లో కలువ కళ్ల కాజల్ అగర్వాల్ పేరు కూడా చేరింది. మేడమ్ టుస్సాడ్స్లో కొలువు తీరనున్న ఫస్ట్ సౌతిండియా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్లో ఫిబ్రవరి 5న కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కాజల్ ఓ వీడియో పోస్ట్ చేసింది.
తన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్లో పెడుతున్నందుకు సంతోషంగా ఉందని, దీనికోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే.. విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘భారతీయుడు 2’ తో పాటు తెలుగులో మంచు విష్ణు పక్కన ‘మోసగాళ్లు’ సినిమాలోనూ నటిస్తోంది కాజల్ అగర్వాల్.
.@MsKajalAggarwal's Wax Statue at #MadameTussauds is getting unveiled tomorrow.#KajalMadameTussauds#Kajal #KajalAggarwal #MadameTussaudsSG #MTSG@MTsSingapore pic.twitter.com/0oelsEGovc
— BARaju (@baraju_SuperHit) February 4, 2020