Kangana Ranaut : డెంగ్యూ వచ్చినా షూట్ కి వచ్చిన హీరోయిన్.. ఒక పక్క మెయిన్ లీడ్.. మరోపక్క డైరెక్టర్ గా..

తాజాగా కంగనా అస్వస్థతకు లోనైంది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోట్లేదు. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించగా ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా షూట్ కి వచ్చి తన పనులు చేస్తుంది. దీంతో సినిమా నిర్మాణ సంస్థ..............

Kangana Ranaut : డెంగ్యూ వచ్చినా షూట్ కి వచ్చిన హీరోయిన్.. ఒక పక్క మెయిన్ లీడ్.. మరోపక్క డైరెక్టర్ గా..

Kangana Ranaut

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాతో బిజీగా ఉంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రని పోషిస్తుంది కంగనా. ఈ సినిమాలో మెయిన్ లీడ్ తో పాటు, డైరెక్టర్ గా కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా నిలిచిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉంది. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది కంగనా.

అయితే తాజాగా కంగనా అస్వస్థతకు లోనైంది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోట్లేదు. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించగా ఆమెకు డెంగ్యూ ఉన్నట్లు తేలింది. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా షూట్ కి వచ్చి తన పనులు చేస్తుంది. దీంతో సినిమా నిర్మాణ సంస్థ షూటింగ్ సెట్ లోని కంగనా ఫొటోలని పోస్ట్ చేసి..”డెంగ్యూ వచ్చి, తెల్ల రక్తకణాలు తగ్గిపోయి, జ్వరంతో ఒళ్లంతా కాలిపోతున్నా మీరు మాత్రం పని చేయడం ఆపడంలేదు. దీన్ని ప్యాషన్‌ కాదు పిచ్చి అంటారు. కంగనా రనౌత్‌ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం” అని వారి ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

Nithin : ఇండియాలో ఎక్కువ ఫ్లాప్ సినిమాలు ఏ హీరోకి ఉన్నాయి అని వెతికేవాడిని.. లవ్ సినిమాలు చేసి బోర్ కొట్టింది..

దీనికి కంగనా స్పందిస్తూ..”థ్యాంక్యూ టీమ్‌.. అయినా జబ్బు వచ్చింది శరీరానికి కానీ నా ఆశయానికి కాదు” అని పోస్ట్ చేసింది.