Kangana Ranuat : సౌత్ స్టార్లపై కంగనా కామెంట్స్.. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు..
తన స్టోరీలో అల్లు అర్జున్, యశ్ ఫోటోలని షేర్ చేస్తూ.. ''సౌత్ కంటెంట్ కి, సౌత్ స్టార్స్ కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ..........
Kangana Ranuat : కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్. దేశం గురించి, మహిళల గురించి, తన గురించి అయినా ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ అవుతుంది. ఇక బాలీవుడ్ లో కొంతమందిని, నెపోటిజాన్ని వ్యతిరేకిస్తుంది. బాలీవుడ్ కల్చర్ ని వ్యతిరేకిస్తుంది. ఎవరినైనా సరే ఎంతటి వారినైనా సరే తన మాటలతో చెడుగుడు ఆడిస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఒకపక్క అదిరిపోయే సినిమాలు చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ దేశంలో జరిగే విషయాలపైన తన రీతిలో స్పందిస్తుంది. ఎన్నో సార్లు ఎంతోమందిపై భయపడకుండా కామెంట్స్ చేసింది. వివాదాల్లో కూడా ఎప్పుడూ ఉంటుంది కంగనా. అయినా అవేమి పట్టించుకోకుండా తన పని తానూ చేసుకెళ్లిపోతుంది. తాజాగా సౌత్ స్టార్స్ పై తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది.
ఇటీవల సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారుతూ ఇండియా మొత్తం మార్కెట్ ని సాధిస్తున్నారు. బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో కలెక్షన్స్ సాధిస్తున్నారు సౌత్ స్టార్స్. ఇటీవల ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా ఈ పోస్ట్ పెట్టింది.
Keerthi Suresh : ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్.. షూటర్గా కీర్తి సురేష్
తన స్టోరీలో అల్లు అర్జున్, యశ్ ఫోటోలని షేర్ చేస్తూ.. ”సౌత్ కంటెంట్ కి, సౌత్ స్టార్స్ కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికున్న ప్యాషన్, వృతిపరమైన నిబద్ధత అపారమైనది” అని పోస్ట్ చేసింది. ఇదే పోస్ట్ లో ”బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి” అంటూ పోస్ట్ చేసింది.