Kiara Advani : రిలేషన్‌షిప్‌ లో ఎలా ఉండాలో చెప్తున్న కియారా అద్వానీ..

ఓ ఇంటర్వ్యూలో కియారా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడింది. రిలేషన్‌షిప్‌ లో తప్పు ఎవరిది ఉన్నా సారీ చెప్పాల్సిందే అంటుంది. కియారా మాట్లాడుతూ...........

Kiara Advani : రిలేషన్‌షిప్‌ లో ఎలా ఉండాలో చెప్తున్న కియారా అద్వానీ..

Kiara

Kiara Advani :  తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో పలకరించిన కియారా అద్వానీ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఇటీవలే భూల్ భూలయ్య2 సినిమాతో హిట్ కొట్టింది కియారా. ప్రస్తుతం కియారా నటించిన జుగ్ జుగ్ జీయో సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

జుగ్ జుగ్ జీయో సినిమా ప్రమోషన్స్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది కియారా అద్వానీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడింది. రిలేషన్‌షిప్‌ లో తప్పు ఎవరిది ఉన్నా సారీ చెప్పాల్సిందే అంటుంది. కియారా మాట్లాడుతూ.. ”ఏ బంధంలో అయినా గొడవలు రావడం సహజం. గొడవలు ఎప్పుడు జరిగినా భర్తలే ముందు భార్యకు క్షమాపణలు చెబుతారని పెళ్లైన వాళ్ళు అంటుంటే విన్నాను. కానీ గొడవలు ఎవరి వల్ల జరిగినా క్షమాపణలు చెప్పడమనేది ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. పెళ్లి, దాని తర్వాత వచ్చే గొడవల గురించి నేను చెప్పను. కానీ ఏ రిలేషన్‌లోనైనా గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ సారీలు చెప్పుకోవడంలో తప్పులేదు. నేనైతే గొడవ పెరగకుండా ఉండటానికే చూసుకుంటాను. గొడవకి అంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టి సారీ చెప్పి బంధానికి ప్రాముఖ్యత ఇస్తాను. కాబట్టి నేనైతే సారీ చెప్పడానికి అస్సలు ఇబ్బంది పడను, ఎందుకంటే ఈగోల కంటే ప్రేమ ముఖ్యం” అని తెలిపింది.

Keerthy Suresh : తెలుపులో తళతళలాడుతున్న కళావతి..

 

కియారా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌షిప్‌ లో ఉందని, తర్వాత విబేధాలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై వాళ్లిద్దరూ స్పందించలేదు. మరి సడెన్ గా రిలేషన్‌షిప్‌ గురించి కియారా ఎందుకు వ్యాఖ్యలు చేసింది అని అంతా ఆలోచిస్తున్నారు.