Syamaladevi : ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు.. ఒకేసారి వెళ్లిపోయారు.. కృష్ణంరాజు సతీమణి!

సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విన్న అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనని కడసారి చూసేందుకు తరలి వస్తున్నారు. కృష్ణకి నివాళ్లు అర్పించేందుకు వచ్చిన స్వర్గీయ కృష్ణంరాజు భార్య 'శ్యామలాదేవి' మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ గారు అంటే కృష్ణంరాజు గారికి అమితమైన ప్రేమ. ఇద్దరు ప్రాణస్నేహితులు. వీరిద్దరూ...

Syamaladevi : ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు.. ఒకేసారి వెళ్లిపోయారు.. కృష్ణంరాజు సతీమణి!

Krishnamraj wife Syamaladevi says Both krishna and krishnam raju left and came into the industry at the same time

Syamaladevi : సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విన్న అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనని కడసారి చూసేందుకు తరలి వస్తున్నారు. ఇవాళ్టి ఉదయం వరకు నానక్‌రామ్‌గూడలోని ఇంటివద్దే భౌతికకాయాన్ని ఉంచిన కుటుంబసభ్యులు.. అభిమానుల సందర్శనార్ధం కోసం పద్మాలయ స్టూడియోస్ కి తరలించారు. దీంతో తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు స్టూడియో వద్దకు బారులు తీరారు.

Super Star Krishna : పద్మాలయ స్టూడియోకి కృష్ణ భౌతికకాయం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..

ఇక విషయానికి వస్తే నిన్న కృష్ణకి నివాళ్లు అర్పించేందుకు వచ్చిన స్వర్గీయ కృష్ణంరాజు భార్య ‘శ్యామలాదేవి’ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ గారు అంటే కృష్ణంరాజు గారికి అమితమైన ప్రేమ. ఇద్దరు ప్రాణస్నేహితులు. వీరిద్దరూ ఒకసారి సినీ ఇండస్ట్రీకి వచ్చారు. మరి వెళ్లిపోయేటప్పుడు కూడా కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారేమో. మనందరికి ఇంతటి శోకాని మిగిల్చి ఇద్దరు ఒకేసారి వెళ్లిపోయారు” అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు ఒక ఏడాది వ్యవధిలోనే హీరోగా మొదటి సినిమాతో ప్రేక్షకుల పరిచయమయ్యారు.

కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి కృష్ణ అంతిమయాత్ర మొదలు కానుంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబిలీహిల్స్ మహాప్రస్థానం వరకు ఇది కొనసాగనుంది. సుమారు 3 గంటల సమయంలో అధికార లాంఛనాలు మధ్య కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.