‘ముద్ర’ వివాదం : నన్ను వాడేస్తున్నారు – నిఖిల్ ట్వీట్

  • Published By: madhu ,Published On : January 25, 2019 / 02:02 PM IST
‘ముద్ర’ వివాదం : నన్ను వాడేస్తున్నారు – నిఖిల్ ట్వీట్

హైదరాబాద్ : నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ముద్ర’ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందే ఊహించని షాక్ తగిలింది. ‘ముద్ర’ పేరుతో అదే లోగో టైటిల్‌ని నిఖిల్ పేరును వాడుకుంటూ రేపే (జనవరి 25) ‘ముద్ర’ మూవీ రిలీజ్ అంటూ టిక్కెట్లను ఆన్ లైన్‌లో పెట్టేశారు. దీంతో షాకైన నిఖిల్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘గాయ్స్ .. నా సినిమా ఈ వారంలో రిలీజ్ కావట్లేదు. కొందరు కావాలని నా సినిమా లోగో మరియు నా పేరును వాడుకొని బుకింగ్ యాప్స్‌లో పెట్టారు. మా నిర్మాతలు దీనిపై చర్యలు తీసుకుంటారు. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తా..ఇది చాలా అవమానకరం’ అంటూ ‘ముద్ర’ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు నిఖిల్.