Nandu : నా మూడు సంవత్సరాల సంపాదన ఈ సినిమా మీద పెట్టా.. రష్మీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..

గురువారం సాయంత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాగశౌర్యతో పాటు పలువురు టీవీ, సినీ ప్రముఖులు వచ్చారు. ఈ ఈవెంట్ లో నందు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు......

Nandu : నా మూడు సంవత్సరాల సంపాదన ఈ సినిమా మీద పెట్టా.. రష్మీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..

Nandu speech in Bomma Blockbuster Movie Pre Release Event

Nandu :  నందు హీరోగా, రష్మీ హీరోయిన్ గా కొత్త దర్శకుడు విరాట్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా నేడు నవంబర్ 4న రిలీజ్ అవుతుంది. చాలా తక్కువ టైంలో రష్మీ, నందు కలిసి ఫుల్ గా ఈ సినిమా ప్రమోషన్స్ చేశారు. గురువారం సాయంత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాగశౌర్యతో పాటు పలువురు టీవీ, సినీ ప్రముఖులు వచ్చారు.

ఈ ఈవెంట్ లో నందు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నందు మాట్లాడుతూ.. ”యూట్యూబ్ లో చోటు అనే ఓ సినిమా చూసి ఈ డైరెక్టర్ కి మెసేజ్ చేశాను. కలిసిన తర్వాత ఒక మంచి సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యాం. కొన్ని నెలల పాటు కూర్చొని ఈ స్క్రిప్ట్ ని రాశాం. చాలా మంది నిర్మాతల దగ్గరికి వెళ్ళాం కానీ కథ బాగుంది మాకిచ్చేయండి వేరే హీరో, వేరే డైరెక్టర్స్ తో తీసుకుంటామా అన్నారు. నేను ఈ కథకి సరిపోను అన్నారు. చివరికి ఈ సినిమాని నేనే నిర్మించాలని ఫిక్స్ అయ్యా. స్టార్ స్పోర్ట్స్ లో మూడు సంవత్సరాలుగా యాంకర్ గా చేసి సంపాదించిన డబ్బు మొత్తం ఈ సినిమా మీదే పెట్టాను. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి విరాట్ కి ఇచ్చి సినిమా మొదలుపెట్టామని చెప్పాను”

Sailesh Kolanu : అడివిశేష్ తో సినిమా తీయొద్దన్నారు.. కథలో వేలు పెడతాడు అని చెప్పారు..

”రష్మీ ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేసింది. తను నాకు చాలా కాలంగా మంచి స్నేహితురాలు. ఇటీవల కొంతమంది మా ఇద్దరి గురించి ఏవేవో వార్తలు రాస్తున్నారు. అవన్నీ అబద్దం. రష్మీ నా భార్య గీతకి కూడా మంచి ఫ్రెండ్. ఈ సినిమాకి చాలా మంది కొత్తవాళ్లే పని చేశారు. ఈ సినిమాతో నేను హిట్ కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు కానీ సినీ పరిశ్రమని మాత్రం వదిలి వెళ్ళను. నాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్లేదు. నాలాంటి వాళ్లకి నేను సపోర్ట్ చేస్తాను” అంటూ ఎమోషనల్ అయ్యాడు.