శింబు, ప్రభు.. ఇప్పుడు ఇతను.. టోకెన్ నెంబర్ త్రీ అన్నారు.. తన లవ్ ఫెయిల్యూర్స్‌పై నయన్..

శింబు, ప్రభు.. ఇప్పుడు ఇతను.. టోకెన్ నెంబర్ త్రీ అన్నారు.. తన లవ్ ఫెయిల్యూర్స్‌పై నయన్..

లేడీ సూపర్ స్టార్ నయనతార.. పదిహేనేళ్ల కెరీర్‌లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో, హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. గ్లామర్, ట్రెడిషన్.. ఏ లుక్కులో కనిపించినా, కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ ఏ జానర్ సినిమా చేసినా తన స్టైలే వేరు.

ఇదంతా తెరముందే.. తెరవెనుక నయనతార జీవితంలో ఒడిదుడుకుల గురించి అందరికీ తెలుసు. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారాలు ఒకటికి రెండు సార్లు బెడిసి కొట్టడం ఆమె జీవితంలో ఊహించని మార్పులు తీసుకొచ్చాయి.  తాజాగా తన జీవితంలో ప్రేమ విషయంలో జరిగిన అనుకోని సంఘటనల గురించి స్పందించింది నయన్.

Nayanthara

‘‘నా జీవితంలో రెండుసార్లు ప్రేమ విఫలం కావడానికి కారణం నమ్మకం. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదు. అలాంటప్పుడు కలిసుండడం కన్నా విడిపోవడమే మంచిదని వారితో నా బంధాన్ని వదులుకున్నాను. ఆ సమయంలో నేను ఎంత భాదపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడకపోయినప్పటికీ ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాసుకున్నారు. అయినా సరే నేను మాట్లాడలేదు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి నాకు చాలా కాలమే పట్టింది. సినిమాలే నన్ను తిరిగి మనిషిని చేశాయి. నా అభిమానులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా సినిమాలను మాత్రం వదలను..’’ అని చెప్పుకొచ్చింది నయనతార. గత ఐదేళ్లుగా ఆమె యంగ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. శింబు, ప్రభుదేవా.. ఇప్పుడు ఇతను.. టోకెన్ నెంబర్ త్రీ.. అంటూ  కామెంట్ చేశారని కూడా చెప్పుకొచ్చింది నయన్.

Nayanthara

Read Also : భర్త నుండి విడాకులు పొందిన నటి సిమ్రాన్.. కొడుకు కస్టడీ మాత్రం తనకే..