Nirupam Paritala : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో డాక్టర్ బాబు
తాజాగా డాక్టర్ బాబు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నాడు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిరుపమ్ పరిటాల జూబ్లీహిల్స్లో ఉన్న.......
Nirupam Paritala : సీరియల్ యాక్టర్ నిరుపమ్ పరిటాల చాలా మందికి తెలుసు. కార్తీక దీపంతో నిరుపమ్ మరింత ఫేమస్ అయ్యారు. కార్తీక దీపం లో డాక్టర బాబు క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో ఒక్కడిగా మారిపోయాడు. నిరుపమ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో కూడా చాల యాక్టీవ్ గా ఉంటాడు నిరుపమ్. తాజాగా డాక్టర్ బాబు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నాడు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిరుపమ్ పరిటాల జూబ్లీహిల్స్లో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.
Anchor Suma : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సుమ ఈ ఈవెంట్ చేసింది
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిరుపమ్.. ”పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడం ఆనందంగా ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఎంతో అవసరం, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి. కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణానికి మొక్కలు ఎంతో మేలు చేస్తాయి. తన వంతుగా ఈ రోజు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాను” అని తెలిపారు. ఈ సందర్భంగా తన సహనటులు ప్రీతమ్, అమర్ దీప్ చౌదరి, మానస.. ఈ ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సవీకరించి మొక్కలు నాటవలసిందిగా కోరారు నిరుపమ్.