NTR : మేనత్త ఇంటికి తల్లి, భార్యతో వెళ్లిన ఎన్టీఆర్.. మేనత్తని తలుచుకొని ఏడుస్తూ..
ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లిన ఎన్టీఆర్ కి మేనత్త ఉమామహేశ్వరి ఆఖరి చూపు దక్కలేదు. తన మేనత్త మరణించిన విషయం తెలియగానే ఎన్టీఆర్ తన ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. కానీ వచ్చేలోపే..........
NTR : సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఇటీవల జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉమామహేశ్వరి మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని షాక్ కి గురిచేసింది. ఉమామహేశ్వరి పార్థివ దేహానికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉమామహేశ్వరి ఇంటికి తరలి వెళ్లి ఆమెకి నివాళులు అర్పించి, ఆ కుటుంబ సభ్యులని పరామర్శించారు.
అయితే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లిన ఎన్టీఆర్ కి మేనత్త ఉమామహేశ్వరి ఆఖరి చూపు దక్కలేదు. తన మేనత్త మరణించిన విషయం తెలియగానే ఎన్టీఆర్ తన ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. కానీ వచ్చేలోపే ఆవిడ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఫారిన్ నుంచి రాగానే నేడు గురువారం మధ్యాహ్నం మేనత్త ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. తారక్తో పాటు ఆయన తల్లి, సతీమణి లక్ష్మీ ప్రణతి, అన్న కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులని పరామర్శించారు ఎన్టీఆర్. తన మేనత్తని తలుచుకొని, చివరి చూపు కూడా దక్కలేదని ఏడ్చినట్లు సన్నిహితుల సమాచారం.