Payal Rajput : తిరుపతిలో స్వామి వారిని దర్శించుకున్న పాయల్..
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయల సిబ్బంది ఆమెను సాధారంగా ఆహ్వానించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది పాయల్.....
Payal Rajput : ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో భారీ విజయం సాధించి కుర్రాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించిన హీరోయిన్ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడలో సినిమాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలను షేర్ చేసి అభిమానులకు కిక్కెక్కిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది పాయల్.
ప్రస్తుతం పాయల్ రాజ్పుత్ మంచు విష్ణు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా పాయల్ తిరుమలకు వెళ్ళింది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయల సిబ్బంది ఆమెను సాధారంగా ఆహ్వానించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది పాయల్. లంగావోణీలో ఆలయంను విచ్చేసి తన మొక్కులని చెల్లించింది.
Krishnam Raju : ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పాడు
పాయల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావడంతో మీడియా పర్సన్స్ పాయల్ చుట్టూ చేరిపోయారు. ఆమెను ఫాలో అవుతూ వీడియో బైట్స్, ఫోటోలు తీసుకున్నారు. అభిమానులు కూడా ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. తాను తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్టు తన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి తెలిపింది. వీడియోల్ని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపింది.