సీరియల్ నటి సూసైడ్ కేసులో ట్విస్ట్‌లు.. కీలక ఆడియో లీక్!

  • Published By: vamsi ,Published On : September 10, 2020 / 08:00 AM IST
సీరియల్ నటి సూసైడ్ కేసులో ట్విస్ట్‌లు.. కీలక ఆడియో లీక్!

బుల్లితెర నటి, మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటూ ఉంది. ఈ కేసులో లేటెస్ట్‌గా శ్రావణి – దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. దీనిలో దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు అర్థం అవుతుంది. మర్యాదగా వచ్చి తనతో గంటసేపు గడపాలని శ్రావణిని బెదిరించినట్టు ఆడియోలో ఉంది. తర్వాత జరిగే పరిణామాలకు తనను అడగవద్దని వార్నింగ్ ఇచ్చాడు.



దీనిపై శ్రావణి స్పందిస్తూ.. ‘ఇంతటితో ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా’ అంటూ ప్రాధేయపడినట్టు అందులో ఉంది. మరోవైపు, ఈ కేసులో తనపై దేవరాజు రెడ్డి చేసిన ఆరోపణలపై సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటూ వీడియో విడుదల చేశారు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని అని, శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు.

శ్రావణి ఆత్మహత్య చెసుకున్నప్పటి నుంచి ఆ కుటుంబంతో పాటే ఉన్నానని వెల్లడించారు. తానెక్కడికీ పారిపోలేదని, శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని చెప్పారు.
https://10tv.in/one-women-sucide-in-tamilnadu-for-cell-phone/
శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా.. ప్రేమికుడి వేధింపులు, కుటుంబసభ్యుల మందలింపులు తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు. కాకినాడకు చెందిన దేవరాజు రెడ్డిపై శ్రావణి గతంలోనే బెదిరింపులు, అత్యాచారయత్నం కేసులు పెట్టగా నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.