Project K: ప్రాజెక్ట్-K విషయంలో అవన్నీ రూమర్లేనంటూ తేల్చేసిన నాగ్ అశ్విన్
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్ K’కు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా, మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కథ విషయంలో సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Project K: టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్ K’కు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా, మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా జరుపుకోవడంతో, ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Project K: ప్రాజెక్ట్ K.. సైలెంట్గా కానిచ్చేశారా..?
అయితే ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కథ విషయంలో సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ ఇటీవల వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ను పోలి ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై తనదైన మార్క్లో ఫైర్ అయ్యాడు. తన ఇన్స్టా స్టోరీలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘‘ప్యారెడైజ్ వద్ద బస్సు దిగే ప్రతిఒక్కరూ బిర్యానీ తినరు’’ అంటూ తన సినిమాపై వస్తున్న రూమర్స్ను కొట్టిపారేశాడు.
Project K: ప్రాజెక్ట్-K గ్లింప్స్పై దుల్కర్ హాట్ కామెంట్స్
ఏదేమైనా ప్రాజెక్ట్ K మూవీపై వస్తున్న రూమర్లకు నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా చెక్ పెట్టాడని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సి.అశ్వినీ దత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.