సామజవరగమణ : చదవకుండ అల్లరి చేస్తే..చూస్తూ ఉండగలనా

  • Published By: madhu ,Published On : January 12, 2020 / 08:13 AM IST
సామజవరగమణ : చదవకుండ అల్లరి చేస్తే..చూస్తూ ఉండగలనా

సామజవరగమణ..ఇప్పడు ఈ సాంగ్ అందరి నోళ్లలో ఆడుతోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ అల వైకుంఠపురంలోనిది ఈ సాంగ్. ఈ సాంగ్‌‌‌ను చాలా మంది అనుకరిస్తూ..పేరడీ చేస్తున్నారు. వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టీచర్ సాంగ్‌ను పేరడీ చేస్తూ పాడిన పాట..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

 

‘నీ కళ్లకు కావాలి కాస్త నీ భవిష్యత్‌పై కలలు..సమయమంతా వృథా చేస్తే..ఉండదురా ఫ్యూచర్..నీ మనసు గాలి ఊయ్యాలలూగుతూ ఉంటే చెడిపోతవ్..నీ ధ్యాసను పెడితే మంచోడి అవుతవ్…సామజవరగమణ..నిన్ను చూసి ఆగగలనా..చదవకుండా అల్లరి చేస్తూ..చూస్తూ ఉండగలనా..స్టైల్లను వీడుమా..ఎన్నెన్ని సోకులు ఉన్నగాని..తెలివిని పెంచుమా…మంచిగ చదువుమా..బుద్ధిగా ఉండుమా..10మందిలో నీవు గెలిచి పేరును గొంచుమా..అరే నీ ధ్యాసే నాన్నకు..నీ ఊసే అమ్మకు..ఉలకవు..పలకవు..చిన్నా…నీవు పుస్తకం పట్టుకుని చదవకపోతే..ఫెయిల్ అవుతవు కన్న..చూపులల్లా పక్కకు పెట్టకు..టైం వేస్టురా నాన్న’. అంటూ ఓ టీచర్ పాటలా పాడి వినిపించారు. 

 

సమయాన్ని వృథా చేసుకోకుండా..భవిష్యత్‌పై విద్యార్థులు దృష్టి పెట్టాలంటూ..ఈ టీచర్ పాడిన పాటను నెటిజన్లు హాట్య్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోయిన్‌గా పూజా హెగ్డే హీరోయిన్ గా అల వైకుంఠపురం సినిమా రూపొందింది. టబు కీలక పాత్ర పోషించారు. 

అలా వైకుంఠపురం సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదనే సంగతి తెలిసిందే. కానీ ఆన్ లైన్ పాటలు విడుదలై రచ్చ రచ్చ చేస్తున్నాయి. కొన్ని పాటలైతే రికార్డులు సృష్టించాయి. 2020, జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సుమద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్దన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, షమ్మి సాయి తదితరులు నటించారు. ఫైట్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ