టైక్వాండోలో షారూఖ్ కుమారుడు అబ్రామ్ కు గోల్డ్ మెడల్…
తైక్వాండోలో తన చిన్న కుమారుడు అబ్రామ్ బంగారు పతకం సాధించడంతో మరోసారి సంతోషంగా ఉందని షారూఖ్ ఖాన్ ట్విట్టర్ లో ప్రకటించారు.
తైక్వాండోలో తన చిన్న కుమారుడు అబ్రామ్ బంగారు పతకం సాధించడంతో మరోసారి సంతోషంగా ఉందని షారూఖ్ ఖాన్ ట్విట్టర్ లో ప్రకటించారు.
తైక్వాండోలో తన చిన్న కుమారుడు అబ్రామ్ బంగారు పతకం సాధించడంతో మరోసారి సంతోషంగా ఉందని షారూఖ్ ఖాన్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ మ్యాచ్ లో తన కొడుకు పాల్గొన్న ఫొటోలు, ఆరేళ్ల వయస్సులో కుమారుడు సాధించిన బంగారు పతకంతో ఉన్న ఫోటోలను షారూఖ్ పంచుకున్నాడు.
“మీ శిక్షణ … మీ పోరాటం… మీ విజయం. ఈ పతకంతో, నా పిల్లలకు నాకన్నా ఎక్కువ అవార్డులు ఉన్నాయని అనుకుంటున్నాను. ఇది మంచి విషయం … ఇప్పుడు నేను మరింత శిక్షణ పొందాలి! గర్వంగా మరియు ప్రేరణతో! ”అని రాశాడు.
అబ్రామ్ తోపాటు ఆర్యన్, సుహానా కూడా టైక్వాండోలో శిక్షణ పొందారు. ఈ ముగ్గురికి మార్షల్ ఆర్ట్లో కిరణ్ ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. గత సంవత్సరం అబ్రమ్ టైక్వాండోలో ఎల్లో బెల్టు సాధించాడని షారూఖ్ గర్వంగా ప్రకటించాడు.
2010 లో జరిగిన మహారాష్ట్ర టైక్వాండో పోటీలో ఆర్యన్, సుహానా ఇద్దరూ బంగారు పతకాలు సాధించారు. షారూఖ్కు కూడా దక్షిణ కొరియా ప్రభుత్వం టైక్వాండోలో గౌరవ ఐదో డిగ్రీ బ్లాక్ బెల్ట్ను ప్రదానం చేసింది. కానీ, షారూఖ్ ఖాన్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందలేదు.
గత నెలలో జరిగిన పాఠశాల క్రీడా దినోత్సవంలో అబ్రామ్ రజత పతకం, కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తన కుమారుడు సాధించిన పతకాలకు సంబంధించిన వివరాలను షారుఖ్ ట్విట్టర్లో పంచుకున్నారు.
ఇదిలావుండగా షారుఖ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రకటించలేదు. ఇటీవల దర్శకుడు ద్వయం రాజ్ నిడిమోరు, రాజ్ & డికెగా ప్రసిద్ధి చెందిన కృష్ణ డికె, తమ రాబోయే ప్రాజెక్టులలో ఒకదాని కోసం షారూఖ్ ఖాన్ తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.