శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం

శర్వానంద్, రీతూ వర్మ జంటగా.. తెలుగు, తమిళ్‌లో రూపొందుతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

  • Published By: sekhar ,Published On : August 28, 2019 / 08:24 AM IST
శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం

శర్వానంద్, రీతూ వర్మ జంటగా.. తెలుగు, తమిళ్‌లో రూపొందుతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

ఇటీవలే రణరంగం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ’96’ రీమేక్‌తో పాటు.. కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డితో ‘శ్రీకారం’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమా మొదలుపెట్టాడు.. శర్వానంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

తెలుగమ్మాయి రీతూ వర్మ తొలిసారి శర్వాతో జతకడుతుంది. ఈ సినిమా ద్వారా శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ డ్రీమ్ వారియర్ పిక్చర్ సంస్థ తెలుగుతో పాటు తమిళ్‌లోనూ నిర్మిస్తుంది. ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం : 18గా ఈ మూవీ రూపొందనుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : ముంబై సాగా – షూటింగ్ ప్రారంభం..

ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో జరుగనుంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తుండడం విశేషం. ప్రస్తుతం ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. సినిమాటోగ్రఫీ : సుజీత్ సారంగ్, మ్యూజిక్ : జేక్స్ బెజోయ్.