వెంటిలేటర్ తొలగించారనే వార్తలు అవాస్తవం.. SP చరణ్..
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా వైరస్ సోకడంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చికిత్స అందిస్తున్నామని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఐసీయులోనే ఉంచామని సోమవారం సాయంత్రం డాక్టర్స్ బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అయితేమంగళవారం బాలు సోదరి, ప్రముఖ గాయని ఎస్.పి.శైలజ ఆయన ఆరోగ్యం గురించి చెప్పారంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. బాలు గారికి వెంటిలేటర్ తొలగించారని, ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని ఆమె చెప్పినట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీంతో బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటకప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్న ఆయన తనయుడు ఎస్.పి.చరణ్ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘బాలు గారి హెల్త్ కండీషన్ నిన్నటిలానే ఉంది, వెంటిలేటర్ తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవం.. వైద్యులు మెరుగైన వైద్యమందిస్తున్నారు.. మీ అందరి ప్రార్థనల వల్ల ఆయన త్వరగా కోలుకుంటారని’ ఆశిస్తున్నట్లు తెలిపారు చరణ్.
https://www.instagram.com/p/CEBy2Pzh-YN/?utm_source=ig_web_copy_link