Natarathnalu : కమెడియన్స్‌తో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్‌గా ‘నటరత్నాలు’

సుదర్శన్, రంగస్థలం మహేష్ లతో పాటు యువ నటుడు అర్జున్ తేజ్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా, థ్రిల్లింగ్ అంశాలతో.....

Natarathnalu : కమెడియన్స్‌తో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్‌గా ‘నటరత్నాలు’

Natarathnalu

Natarathnalu :  ఇటీవల చిన్న చిన్న హీరోలు ఎక్కువగా కంటెంట్ బేస్డ్ సినిమాలతో వస్తున్నారు. అలాంటి సినిమాలకి ఆదరణ వస్తుంది. విలక్షణ కథలపై ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాంటి కోవలోకి తీసుకొచ్చేలా ఎన్.ఎస్. నాగేశ్వరరావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం ‘నటరత్నాలు’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్.

గాదె నాగభూషణం దర్శకత్వంలో కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా శివనాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమై కమెడియన్ గా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్, రంగస్థలం మహేష్ లతో పాటు యువ నటుడు అర్జున్ తేజ్ ప్రధాన పాత్రలలో ఈ సినిమాలో నటిస్తున్నారు. డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి, తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Ram Charan : భక్తితో శివలింగాన్ని కడుగుతున్న చరణ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..

అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా, అలాగే థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కబోతుంది. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. దర్శకనిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చాలా గ్రాండ్‌గా ఈ ‘నటరత్నాలు’ సినిమాని తెరకెక్కించనున్నారు.