Adivi Sesh : సాహో తర్వాత సుజీత్‌కి బాలీవుడ్ ఆఫర్స్ చాలా వచ్చాయి.. కానీ..

అడివి శేష్ మాట్లాడుతూ.. ''దాదాపు మూడేళ్ళ తర్వాత సుజిత్ కి మంచి ప్రాజెక్టు కుదిరింది. సాహో సినిమా తర్వాత సుజీత్ కి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ వాళ్ళకి నో చెప్పి..............

Adivi Sesh : సాహో తర్వాత సుజీత్‌కి బాలీవుడ్ ఆఫర్స్ చాలా వచ్చాయి.. కానీ..

Sujeeth gets so many offers from bollywood after saaho

Adivi Sesh :  సాహో సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు కనపడకుండా పోయిన దర్శకుడు సుజీత్ నుంచి ఇటీవల కొత్త సినిమా అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేయడంతో అభిమానులతో పాటు సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

సుజీత్ మొదటి సినిమా రన్ రాజా రన్ మంచి హిట్ అయింది. ఈ సినిమాలో అడివి శేష్ కూడా నటించాడు. అడివి శేష్, సుజీత్ అప్పట్నుంచి మంచి స్నేహితులు. ప్రస్తుతం అడివి శేష్ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే హిట్ 2 సినిమాతో మంచి విజయం సాధించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుజీత్-పవన్ కళ్యాణ్ సినిమా గురించి వ్యాఖ్యలు చేశాడు శేష్.

అడివి శేష్ మాట్లాడుతూ.. ”దాదాపు మూడేళ్ళ తర్వాత సుజిత్ కి మంచి ప్రాజెక్టు కుదిరింది. సాహో సినిమా తర్వాత సుజీత్ కి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ వాళ్ళకి నో చెప్పి తెలుగులోనే సినిమాలు చేస్తానన్నాడు. సుజీత్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని. తన ఫేవరేట్ హీరోని ఎలా చూపిస్తాడో ఇంకా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్టు విషయంలో అకీరా కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం” అని తెలిపారు.

Adivi Sesh : సత్యదేవ్‌ ని నా ప్రతి సినిమాలో క్యారెక్టర్ చేయమని అడుగుతున్నా.. హిట్ 2లో కూడా అడిగా.. కానీ ఖాళి లేడు..

అడివి శేష్, అకిరా కూడా మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. ఇక సుజీత్ పవన్ కళ్యాణ్ సినిమా గ్యాంగ్‌స్టర్ కథ నేపథ్యంలో ఉండబోతుందని, జపాన్-ఇండియాలో కథ నడవనుందని అనౌన్సమెంట్ పోస్టర్ తోనే చెప్పేశాడు సుజీత్. దీంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు.