Simha Awards : సింహ అవార్డు ఇవ్వటం లేదు.. స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్!

సినిమా ఆర్టిస్టులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ప్రభుత్వం ఇచ్చే నంది, సింహా అవార్డులు. అయితే గత కొంత కాలంగా ఈ అవార్డులను ఇవ్వడం మానేశాయి ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు. తాజాగా ఈ అవార్డులు గురించి సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు పై విమర్శలు చేశాడు. దీని పై తెలంగాణ సినిమాటోగ్రాఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించాడు.

Simha Awards : సింహ అవార్డు ఇవ్వటం లేదు.. స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్!

simha awards

Simha Awards : సినిమా ఆర్టిస్టులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ప్రభుత్వం ఇచ్చే నంది, సింహా అవార్డులు. అయితే గత కొంత కాలంగా ఈ అవార్డులను ఇవ్వడం మానేశాయి ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు. చివరిగా ఈ పురస్కారం 2016లో జరిగింది. అప్పటి నుంచి ఈ అవార్డులు గురించి రెండు ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. తాజాగా ఈ అవార్డులు గురించి సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు పై విమర్శలు చేశాడు. దీని పై తెలంగాణ సినిమాటోగ్రాఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించాడు.
Bollywood vs Tollywood :బాలీవుడు వర్సెస్ టాలీవుడు.. ఫిబ్రవరిలో క్రికెట్ మ్యాచ్..

ఇటీవల ‘టీఎఫ్‌పీసీ’ ఎన్నికలు ప్రకటించే సభలో సి కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒక ఆర్టిస్ట్ కి అయినా, ఒక టెక్నీషియన్ కి అయినా నంది మరియు సింహా అవార్డులు చాలా ముఖ్యం. ఇద్దరి ముఖ్యమంత్రులను ఈ సభా వేదికగా నేను కోరేది ఒకటే. సినిమాని రాజకీయంతో చూడకండి. కొన్ని సంవత్సరాలుగా ఇవ్వకుండా ఉన్న నంది, సింహా అవార్డులను వెంటనే ప్రకటించండి. లేదంటే మేమే ఒక అవార్డు పెట్టుకొని ప్రకటించుకుంటాం అంటూ విమర్శలు చేశాడు.

దీంతో నేడు ఈ విషయం గురించి.. సినీ స్టార్స్ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ ని ప్రశ్నించారు విలేకర్లు. దీనికి తలసాని బదులిస్తూ.. సీ కళ్యాణ్ ఏం అన్నాడో మేము చూడలేదు. తెలంగాణా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఇచ్చే ప్రతిష్టత్మక సింహ అవార్డుల పై త్వరలో మీటింగ్ పెట్టి డిస్కషన్ చేస్తాం. అలాగే త్వరలోనే అవార్డులు ప్రకటించి ఫంక్షన్ కూడా నిర్వహిస్తాము అంటూ వెల్లడించాడు. అయితే దీని పై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పందించ లేదు. త్వరలోనే జగన్ సర్కార్ కూడా నంది అవార్డులను ప్రకటిస్తుంది అని ఆకాంక్షిస్తున్నారు ఆర్టిస్టులు.