ఉపాసన ఎవర్ని దత్తత తీసుకుందో తెలుసా!

  • Published By: sekhar ,Published On : July 21, 2020 / 11:37 AM IST
ఉపాసన ఎవర్ని దత్తత తీసుకుందో తెలుసా!

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ భార్యగానే కాకుండా యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన కొణిదెల. సోమవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉపాసన ఓ మంచి పని చేశారు.
అదేంటంటే ఆమె దత్తత స్వీకరించారు. అయితే దత్తత తీసుకుంది పిల్లాడినో, పిల్ల‌నో కాదు.. ఓ ఎనుగుని ద‌త్తత తీసుకున్నారు ఉపాస‌న‌. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నెహ్రూ జూపార్కును సంద‌ర్శించిన ఉపాస‌న రాణి అనే ఎనుగును ఏడాది కాలానికి ద‌త్త‌త తీసుకున్నారు.

Upasana-Ram Charanఈ సంద‌ర్భంగా సంవత్సరానికి గానూ రాణి పోష‌ణ‌కు అయ్యే ఖ‌ర్చు రూ.5 ల‌క్ష‌ల‌ను ఐఎఫ్‌య‌స్ అధికారి క్షితిజ‌కు అందించారు. ఉపాస‌న సేవా దృక్ప‌ధాన్నిక్యూరేట‌ర్‌, ఐఎఫ్‌య‌స్ అధికారి క్షితిజ ప్ర‌శంసించారు. ‘నువ్వు చేసే సేవా కార్యక్రమాలు.. ఎంత చిన్నవైనా అవి వృథా కావు. నువ్వు ఇలాగే మంచి పనులు చేసుకుంటూ వెళితే తప్పకుండా గుర్తింపు వస్తుంది. హ్యాపీ బర్త్‌డే’ అంటూ చరణ్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.Elephant