Virupaksha: విరూపాక్ష చూస్తే కాంతార కాదు.. ఆ సినిమా గుర్తుకొస్తుందట!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ చూస్తే, కాంతార చిత్రం గుర్తుకు రాదని తేజు తెలిపాడు.

Virupaksha: విరూపాక్ష చూస్తే కాంతార కాదు.. ఆ సినిమా గుర్తుకొస్తుందట!

Virupaksha Not Similar To Kantara Says Sai Dharam Tej

Virupaksha: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా, పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఏప్రిల్ 21న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు మధ్య రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Virupaksha : సాయి ధరమ్ తేజ్ & సంయుక్త విరూపాక్ష స్పెషల్ ఇంటర్వ్యూ

ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను హీరో తేజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ చూసి ఈ సినిమాను కాంతార చిత్రంతో పోలుస్తున్నారని.. కానీ, ఈ సినిమా కాంతార సినిమాకు ఏ విధంగా కూడా లింక్ లేదని తేజు తెలిపారు. విరూపాక్ష చూస్తున్నంత సేపు అసలు కాంతార ఛాయలు కనిపించవని.. మనకు ఆ సినిమా గుర్తుకు రాదని ఆయన అన్నారు.

Virupaksha: ‘విరూపాక్ష’కు బలాన్ని ఇస్తోన్న పాజిటివ్ రిపోర్ట్స్.. బాక్సాఫీస్ వద్ద చెడుగుడే!

కాగా, ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు ఇండియానా జోన్స్ మూవీ మాత్రం ఖచ్చితంగా గుర్తుకు వస్తుందని తేజు తెలిపారు. ఇక ఈ సినిమాను కార్తీక్ దండు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాలో నటించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తేజు తెలిపాడు. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.