Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్..
ఒక పక్క అభిమానులు, ప్రేక్షకులే కాక, పలువురు ప్రముఖులు కూడా సర్కారు వారి పాట సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి................
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ అయి భారీ విజయంతో దూసుకుపోతుంది. మొదటి రోజు భారీగా కలెక్షన్స్ కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు నెలకొల్పింది. ఇక ఓవర్సీస్ లో అయితే వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ఇందులో బ్యాంక్ కుంభకోణాలు, బ్యాంకులకు కార్పొరేట్ అధినేతలు వేల కోట్లు లోన్ ఎగ్గొట్టడాలు అనే అంశాలని కమర్షియల్ పాయింట్లతో చూపించారు.
Tina Sadhu : ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ మరణం.. షాక్లో సినీ పరిశ్రమ..
ఒక పక్క అభిమానులు, ప్రేక్షకులే కాక, పలువురు ప్రముఖులు కూడా సర్కారు వారి పాట సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. సినిమాని, మహేష్ బాబుని అభినందిస్తూ ఈ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ లో.. ”సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట` బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు” అని తెలిపారు. ఈ సినిమాపై వైసీపీ ఎంపీ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
All the best to #MaheshBabu #wishes #greetings.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022