హిందువా? ముస్లిమా అనేది ముఖ్యంగా కాదు..వాళ్లు మేజర్లా కాదా అనేది ఇంపార్టెంట్ : HC

  • Published By: nagamani ,Published On : November 24, 2020 / 04:34 PM IST
హిందువా? ముస్లిమా అనేది ముఖ్యంగా కాదు..వాళ్లు మేజర్లా కాదా అనేది ఇంపార్టెంట్ : HC

Allahabad high court says they are majors says : ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదనీ అలహామాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. వివాహం చేసుకున్నవారు హిందువా? ముస్లిమా అనే విషయం ముఖ్యం కాదనీ వారు ఏఏ మతాలకు చెందినవారైనా సరే వివాహం చేసుకున్నవారు మేజర్లా కాదా అనేదే ముఖ్యమనీ..ఇద్దరు మేజర్ల మధ్య ఉన్న బంధాన్ని వ్యతిరేకించలేమని స్పష్టంచేసింది ధర్మాసనం.



మతాంత వివాహం చేసుకున్నవారు హిందువా, ముస్లిమా? అనే విషయం న్యాయస్థానం చూడదు..వారు మేజర్లా? కాదా? అన్న అంశాన్ని న్యాయస్థానం పరిగణిలోకి తీసుకుంటుందని తేల్చి చెప్పింది. మేజర్లకు జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందనీ..ఆ విషయంలో జోక్యం చేసుకునే హక్కు లేదని హైకోర్టు పేర్కొంది.



దేశ వ్యాప్తంగా ‘లవ్‌ జిహాద్’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు ఈ కీలక తీర్పును వెల్లడించింది. మతాంత వివాహాలు జరుగుతున్న సందర్భంలో అమ్మాయి లేదా అబ్బాయి హిందువా, ముస్లిమా? అనే విషయాన్ని న్యాయస్థానం పట్టించుకోదని, వారు మేజర్లా? కాదా? అన్న అంశమే ముఖ్యమని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.




https://10tv.in/this-video-of-a-child-getting-a-haircut-is-the-internets-latest-hit-many-agree-with-him/
మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్‌పై చర్చ జరుగుతోన్న క్రమంలో అలహాబాద్ కోర్టు మతాంత వివాహం విషయంలో ఈ కీలక తీర్పు నిచ్చింది. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం యువకుడిపై నమోదైన కేసుపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది.


వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని కుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడు అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వార్‌ కొన్నేళ్లుగా ప్రేమించుకునేవారు. వాళ్లు 2019 ఆగస్టులో వారి ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకపోయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.



ఈ క్రమంలో వారి వివాహ సమయంలో హిందూ యువతి అయిన ప్రియాంక మతం మారాలని సలామత్ అన్సారీ చెప్పటంతో ప్రియాంక ముస్లిం మతం స్వీకరించింది. మతం మార్చుకున్న తరువాతనే వారి వివాహం జరిగింది. అప్పటివ రకూ ప్రియాంకగా ఉన్న తన పేరును ఆమె అలియాగా మార్చుకుంది. (మతపెద్దలు నిర్ణయించిన పేరు)దీంతో ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



తన కూతురు మైనర్‌ అనీ తన కూతుర్ని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి జరిపించారని సలామత్ అన్సారీతో పాటు మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు పెట్టాడు. దీంతో సలామత్ తో పాటు ప్రియాంక, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. తాము ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని చెప్పుకున్నారు. తనను ఎవ్వరూ బలవంతం చేయలేదని తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని కోర్టుకు తెలిపింది ప్రియాంక.



కాబట్టి తమపై పెట్టిన కేసును కొట్టేయాలని.. తమకు రక్షణ కల్పించాలని కోరారు. పెళ్లి చేసుకున్న సమయంలో ప్రియాంక వయసు 21 అని తేలింది. ఆమె మైనర్‌ కాదని స్పష్టం చేస్తూ.. ఆమె తన భర్తతో కలిసి జీవించేందుకు అనుమతి ఇస్తున్నట్లు కోర్టు స్పష్టంచేసింది.




మేజర్లయిన ఇద్దరు వ్యక్తులు బంధాన్ని ఏర్పరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే, మత మార్పిడి పెళ్లిళ్ల చెల్లుబాటు అంశంపై కోర్టు స్పందించబోమని న్యాయమూర్తులు పంకజ్ నఖ్వీ, వివేక్ అగర్వాల్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది.కాగా లవ్ జీహాద్ పై ఓ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రకటించిన క్రమంలో కోర్టు ఇటువంటి తీర్పునివ్వటం ప్రాముఖ్యతను సంతరించుకుంది.