JP Nadda : పార్లమెంట్ లో వాజ్పాయి రూమ్ బీజేపీ చీఫ్ నడ్డాకి!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్లమెంట్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగో నెంబరు గదిని కేటాయించబోతున్నట్లు సమాచారం.
JP Nadda బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్లమెంట్ బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగో నెంబరు గదిని కేటాయించబోతున్నట్లు సమాచారం. కాగా, ఈ గదిని 2004లో మాజీ ప్రధానమంత్రి వాజ్పాయికి కేటాయించారు. మొదట్లో ఈ రూమ్ బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకి కేటాయించబడి ఉంది. అయితే 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ప్రధాని పదవి నుంచి వాజ్ పేయి తప్పుకున్న తర్వాత ఆయనకు ఈ గదిని కేటాయించారు. కానీ దీనిని ఆయన ఉపయోగించలేదు.
ఆ తర్వాత ఎన్డీయే చైర్ పర్శన్ హోదాలో ఎల్ కే అద్వాణీ ఈ గదిని ఉపయోగించారు. అయితే మంగళవారం(జులై-20,2021)ఈ గది బయట ఉన్న వాజ్ పేయి మరియు అద్వాణీ నేమ్ ప్లేట్లను తొలగించారు. బీజేపీ చీఫ్ నడ్డాకు ఈ గదిని కేటాయించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.