Viral Video : ఆడపిల్లల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..! స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను పిచ్చకొట్టుడు కొట్టారు, వీడియో వైరల్

Viral Video : విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు స్కూల్ కి వచ్చి గొడవ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ రీడ్ ను ప్రశ్నించారు.

Viral Video : ఆడపిల్లల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..! స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను పిచ్చకొట్టుడు కొట్టారు, వీడియో వైరల్

Viral Video School Principal Beaten (Photo : Google)

Viral Video – School Principal Beaten : స్కూల్ అంటే దేవాలయంతో సమానం, టీచర్లు దైవంతో సమానం అంటారు. ఎందుకంటే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్లు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువులే. ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల తర్వాత టీచర్లదే. అలాంగి గురుతర బాధ్యత ఉంటుంది వారిపై. అందుకే ఉపాధ్యాయుడు అన్నా, టీచర్ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు సమాజంలో. అయితే, కొందరు గురువులు దారితప్పుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పనులు చేసి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు.

మహారాష్ట్ర పుణెలో ఘోరం జరిగింది. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ స్కూల్ లో ఆడపిల్లల బాత్రూమ్ లో సీసీ కెమెరాలు బిగించారు. ఇది బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ ప్రిన్సిపాల్ ను పిచ్చకొట్టుడు కొట్టారు. బట్టలు చించేసి ఉరికించి మరీ దాడి చేశారు.(Viral Video)

పుణె జిల్లా తలేగావ్ దభాడే పట్టణంలో డీవై పాటిల్ ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ లోని అమ్మాయిల వాష్ రూమ్ లో సీసీ కెమెరాలు బిగించారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు స్కూల్ కి వచ్చి గొడవ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ రీడ్ ను ప్రశ్నించారు.

Also Read..Boyfriend : యూపీలో బాయ్ ఫ్రెండ్ దారుణం…వివాహితను గర్భవతిని చేసి, ఆపై…

ఇక ఈ విషయం విద్యార్థి సంఘాల నేతలకు కూడా తెలిసింది. వెంటనే వారు స్కూల్ దగ్గరికి వచ్చారు. కోపంతో ఊగిపోయారు. స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన పాడుపనికి వారి కోపం కట్టలు తెంచుకుంది. అంతే, ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్నారు. అతడిని చితక్కొట్టారు. అతడి బట్టలు చించేసి ఉరికించి మరీ దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి స్కూల్ ప్రిన్సిపాల్ పరుగులు పెట్టారు. ఇదంతా ఫోన్ లో వీడియో తీశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్కూల్ ప్రిన్సిపాల్ అలెగ్జాండర్ పై పిల్లల తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. క్రైస్తవుడైన అలెగ్జాండర్ తన మత విశ్వాసాలను పిల్లలపై రుద్దే వాడని చెప్పారు. గర్ల్స్ వాష్ రూమ్ సీసీ కెమెరాలు బిగించడం కూడా అందులో భాగమే అంటున్నారు. దీనిపై తాము స్కూల్ వర్గాలను నిలదీసినా.. ఆ విషయంలో తామేమీ చేయలేమని వారు చేతులు ఎత్తేసినట్లు పిల్లల తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాదు హిందువుల పండుగలకు సెలవులు కూడా ఇచ్చేవాడు కాదని, పిల్లలకు బైబిల్ లో ప్రార్థనలు నిర్వహించే వాడని పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్ పై ఆరోపణలు చేశారు.

Also Read..Viral Video : దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై షార్ట్ విప్పేసి యువతిపై అత్యాచారయత్నం.. షాకింగ్ వీడియో

కాగా, ఈ వ్యవహారం మతం రంగు పులుముకుంది. ప్రిన్సిపాల్ అల్జెగాండర్.. స్కూల్ లో పిల్లలతో క్రిస్టియన్ ప్రార్థనలు చేయిస్తున్నారని, ఆ కోపంతోనే హిందుత్వ వాదులు ప్రిన్సిపాల్ పై దాడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి.