Presidential elections: ఏకగ్రీవానికి సహకరించండి.. మమతా బెనర్జీని కోరిన రాజ్నాథ్ సింగ్
రాష్ట్రప్రతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్డీయే ఆధ్వర్యంలో బలపర్చే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు.

Presidential elections: రాష్ట్రప్రతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్డీయే ఆధ్వర్యంలో బలపర్చే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మధ్యాహ్నం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేతో ఫోన్ లో మాట్లాడిన రాజ్ నాథ్, సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లతో ఫోన్ లో విడివిడిగా మాట్లాడారు. మమతా బెనర్జీతో పాటు పలువురి నేతలతో రాజ్ నాథ్ ఫోన్ మాట్లాడిన సమయంలో వారి నుంచి ఎలాంటి సానుకూలత రాలేదని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తాము ఎన్డీయే బలపర్చే అభ్యర్థికి మద్దతు ఇవ్వలేమని మమత బెనర్జీ స్పష్టం చేసినట్లు కథనాలు వచ్చాయి. మిగిలిన ప్రధాన ప్రతిపక్ష నేతల నుంచి కూడా అదే రీతిలో సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు తక్కువనే చర్చ జాతీయ రాజకీయాల్లో సాగుతుంది.
Presidential Election: ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ? ఆయన ఎవరంటే..
ఇదిలా ఉంటే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకమైన విపక్షాలన్నీ ఒక పేరు ప్రకటించేందుకు జోరుగా చర్చలు జరుపుతున్నాయి. బుధవారం సాయంత్రం తొలి దశ భేటీ జరిగింది. ఈ భేటీకి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్, వైసీపీకి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆ పార్టీల నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగాలని శరద్ పవార్ ను ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ససేమీరా అన్నారు. తాను పోటీ చేయలేనని, క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం.
శరద్ పవార్ పోటీకి విముఖత చూపడంతో ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఈనెల 21 మరోసారి భేటీ కావాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. 21న ఫలితాలు వెలువడనున్నాయి.
- TRS Support : రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..ఆయనకే గులాబీ మద్దతు!
- Agnipath : త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన రాజ్నాధ్సింగ్
- Agnipath: ‘అగ్నిపథ్’ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ వస్తోన్న వేళ.. రాజ్నాథ్ నేడు కీలక భేటీ
- Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు
- Asaduddin Owaisi : మమతాబెనర్జీ సమావేశానికి నాకు ఆహ్వానం లేదు.. ఒకవేళ ఆహ్వానించినా..
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!