ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు…క్లినికల్ ట్రయల్స్ పై ఐసీఎమ్ఆర్ వివరణ

  • Published By: bheemraj ,Published On : July 4, 2020 / 09:50 PM IST
ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు…క్లినికల్ ట్రయల్స్ పై ఐసీఎమ్ఆర్ వివరణ

క్లినికల్ ట్రయల్స్ పై జరుగుతున్న వివాదంపై ఐసీఎమ్ఆర్ వివరణ ఇచ్చింది. భారత బయోటెక్ టీకా ప్రయత్నాలపై ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్ కు అనుమతి ఇచ్చామని, ఐసీఎమ్ ఆర్.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని తెలిపింది.

దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని వేగవంతంగా వ్యాక్సిన్ తయారీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్, కో-వ్యాక్సిన్ మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి అభించింది.

ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారు జులై 7 లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కో-వ్యాక్సిన్ ను ఆవిష్కరించాలంటూ ఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధన వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

మానవులపై ట్రయల్స్ జురుగకముందే వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఎలా ఖరారు చేస్తారనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఐసీఎమ్ఆర్ భారత భయోటెక్ ప్రీ క్లినికల్ డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డ్రగ్ కంట్రోలర్ అనుమతించారని ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది.