Dalit Girl Gang-Raped : దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్.. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకం

బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయలయ్యాయని దుహాన్ డీసీపీ పేర్కొన్నారు.

Dalit Girl Gang-Raped : దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్.. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకం

Dalit girl gang raped

Students Gang-Raped Dalit Girl : రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో దారుణం జరిగింది. సహాయం చేస్తామని నమ్మించి 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం బాధితురాలు తన స్నేహితుడితో కలిసి బస్సులో అజ్మీర్ నుంచి జోధ్ పూర్ బయల్దేరింది. వారిద్దరూ జోధ్ పూర్ చేరుకునేసరికి రాత్రి 10:30 గంటలు అయ్యింది.

దీంతో వారు రూమ్ కోసం ఓ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అయితే గెస్ట్ హౌస్ కేర్ టేకర్ ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో వారిద్దరు గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆ రాత్రి వేళ వారు పౌటా చౌరహాకు వెళ్లారు. అక్కడ వారికి సమందర్ సింగ్ భాటీ, ధర్మపాల్ సింగ్, భట్టమ్ సింగ్ అనే ముగ్గురు కాలేజీ విద్యార్థులు తారసపడ్డారు. సహాయం చేస్తామని ముగ్గురు విద్యార్థులు వారిని నమ్మించారు. ఆహారం, కూల్ డ్రింక్స్ అందిస్తామని, దుహాన్ లోని రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తామని తెలిపారు.

Woman Killed : కాకినాడ జిల్లాలో మహిళ దారుణ హత్య.. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు

దీంతో ఆ మాటలు నమ్మిన ఇద్దరు వారితో కలిసివెళ్లారు. అలా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ ఓల్డ్ క్యాంపస్ లో ఉన్న హాకీ గ్రౌండ్ కు తీసుకెళ్లారు. అనంతరం బాధితురాలి స్నేహితుడిని చితకబాదారు. అతడి ముందే ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. అయితే తెల్లవారుతుండటంతో అక్కడికి వాకింగ్ కు వచ్చేవారు పెరుగుతుండటంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న వారిద్దరిని చూసిన మార్నింగ్ వాకర్లు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయాలయ్యాయని దుహాన్ డీసీపీ పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు.