ఏంటీ ఏసాలు : డాన్సర్లతో బీజేపీ ఎమ్మెల్యే చిందులు

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 09:05 AM IST
ఏంటీ ఏసాలు : డాన్సర్లతో బీజేపీ ఎమ్మెల్యే చిందులు

బీజేపీ నేతలు వివాదాల్లో చిక్కుకోవటం సర్వసాధారణం. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి చీఫ్ గా బిహేవ్ చేస్తు..విమర్శలను ఎదర్కొంటున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలో డ్యాన్సర్‌తో స్టేజీపై చిందులేసిన  ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. రైతులకు సంబంధించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బోండేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లా మోర్షిలో జాతీయ వ్యవసాయ అభివృద్ధి మండలి (ఎన్ఏడీసీ) కార్యక్రమంలో ఒళ్లు మరచిపోయి స్టేజ్ పై పడుకుంటు లేస్తు..డాన్సర్ తో స్టెప్పులు ఇరగదీసేసారు సదరు ఎమ్మెల్యే.  స్టేజీపై పడుకుని కూడా స్టెప్పులు వేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మోర్షీ ఎమ్మెల్యే డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. 
 

ఎంటైర్ టైన్మెంట్ కోసం డాన్స్ చేసా : అనిల్ బోండే 
ఈ విమర్శలపై స్పందించిన అనిల్ బోండే తాను ఏం తప్పు చేయలేదని ..విదర్భ సంప్రదాయ నృత్యం ఖాదీ గమ్మత్‌లో భాగంగా డ్యాన్స్ చేశాను. అయినా నేను అమ్మాయితో డ్యాన్స్ చేయలేదు. అమ్మాయి వేషంలో ఉన్న బ్యాంకు ఉద్యోగితో స్టెప్పులేశాననీ..నిరంతరం కష్టపడే  రైతులకు కాస్త వినోదాన్ని పంచడానికి ఈవెంట్ ఏర్పాటు చేశామని’ తెలిపారు. 

డ్యాన్స్ షో నిర్వహించడమే అసభ్యకరమైన పని అనీ…రైతుల కోసం నిర్వహించే కార్యక్రమంలో ఇలాంటి పనులు మంచిది కాదనీ..నిజంగా వారిపై అంత ప్రేమ ఉంటే వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి కానీ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశోమతి ఠాకూర్ సూచించారు. 
 

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే