Encounter : భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధికారులకు పక్కా సమాచారం అందింది.

Encounter : భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.

Encounter

Encounter : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం ఉదయం బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానం రావడంతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు.

ఇక గురువారం జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే ఈ ఇద్దరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది నిర్ధారించలేదు. గత ఏడాది కాలంగా సుమారు 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.