జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : August 24, 2019 / 02:22 PM IST
జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను మన్మోహన్,సోనియా,రాహుల్ ఓదార్చారు. 

అరుణ్ జైట్లీ మరణవార్త విని తాను చాలా బాధ పడినట్లు మాజీ ప్రధానిమన్మోహన్ సింగ్ అన్నారు. జైట్లీ కుబుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జైట్లీ చాలా మంచి పరిపాలనాదక్షుడన్నారు. గొప్ప పార్లమెంటేరియన్ అని తెలిపారు. జైట్లీ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

జైట్లీ మరణం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. జైట్లీ మృతి సంతాపం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఫిగర్ గా,పార్లమెంటేరిన్ గా,మంత్రిగా ఆయన అందిన సేవలు ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారన్నారు. కొన్ని రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నెల 9న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన జైట్లీ ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(ఆగస్టు-24,2019)మధ్యాహ్నాం 12:07గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.