సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మరో రెండు కోర్టు హాళ్లను ఏర్పాటు చేశారు. 16, 17 కోర్టు హాళ్లను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సోమవారం (సెప్టెంబర్ 23, 2019) నుంచి 16 ధర్మాసనాల్లో కేసుల విచారణ జరుగుతుంది.
జస్టిస్ కృష్ణమురారీ..
అలహాబాద్కు చెందిన జస్టిస్ కృష్ణమురారీ.. 1981లో బార్కౌన్సిల్ మెంబర్గా చేరి అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టిస్ చేశారు. 2004 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2018 సంవత్సరంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో వీరి పదవీ కాలం 2023 జులై 8వ తేదీ వరకు న్యాయమూర్తిగా కొనసాగుతారు.
జస్టిస్ రవీంద్రభట్..
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతానికి చెందిన జస్టిస్ రవీంద్రభట్ ఢిల్లీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1982వ సంవత్సరంలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 2004వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల పాటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 ఏప్రిల్ నెలలో రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2023 అక్టోబర్ 23వ తేదీ వరకు సుప్రీంకోర్టు బడ్జీ పదవిలో కొనసాగనున్నారు.
జస్టిస్ వీ రామసుబ్రమణ్యన్..
తమిళనాడు రాష్ట్రం చైన్నైకి చెందిన జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యన్ మద్రాస్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1983 ఫిబ్రవరి 16వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 23 సంవత్సరాలపాటు చెన్నై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. 2006 సంవత్సరంలో మద్రాస్ హైకోర్టు న్యాయవాదిగా నియమించబడ్డారు. సుప్రీకోర్టు న్యాయమూర్తిగా 2023 జూన్ 30వ తేదీ వరకు కొనసాగనున్నారు.
జస్టిస్ హృషికేశ్రాయ్..
జస్టిస్ హృషికేశ్రాయ్ 1982వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య పట్టా అందుకున్నారు. బార్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేసుకున్నారు. గౌహతి హైకోర్టులో 2004వ సంవత్సరం వరకు సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. 2006వ సంవత్సరం గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2018వ సంవత్సరంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు విధులు నిర్వహించనున్నారు.