ఫెర్నాండేజ్ నుంచే పోరాట స్ఫూర్తి నేర్చుకున్నా
బీహార్ : మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర భావోద్వేగానికిలోనై కంట తడి పెట్టారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నితీశ్ గుర్తు చేసుకన్నారు. ఫెర్నాండేజ్ మృతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్ఫూర్తిని పొందానని..నితీశ్ నాయకత్వం, మార్గదర్శకం వంటి పలు విషయాలను ఆయను నుంచే నేర్చుకున్నానని చెప్పారు. ప్రజల కోసం పాటుపడే తత్వాన్ని నేర్చుకున్నానన్నారు. ఆయన ప్రజాపోరాటాలను తాము ఎన్నడూ మర్చిపోబోమని.. వాటికి తాము దూరం కాబోమన్నారు. ఈక్రమంలో ఫెర్నాండెజ్ మృతికి బీహార్ లో రెండు రోజుల పాటు సంతాప దినాలను సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.