ఏడేళ్లకే పెళ్లి చేశారు.. 12ఏళ్ల తర్వాత కోర్టుకు యువతి

ఏడేళ్లకే పెళ్లి చేశారు.. 12ఏళ్ల తర్వాత కోర్టుకు యువతి

Girl approaches court 12 years : ఏడేళ్లకే పెళ్లి చేశారు. ఆ వయస్సులో ఏమి తెలియని ఆ చిన్నారికి బాల్య వివాహం చేశారు పెద్దవాళ్లు. పెళ్లి అయిన 12ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ యువతి తన పెళ్లిని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. రాజస్తాన్‌లోని బిల్‌వారా జిల్లాకు చెందిన మన్షి అనే యువతికి 12ఏళ్ల క్రితం 2009లో బాల్య వివాహమైంది. అప్పటి నుంచి ఇంటివద్దే ఉంటూ చదువుకుంటోంది. ఇప్పుడు ఆ యువతి డిగ్రీ చదువుతోంది.

అత్తంటి నుంచి యువతికి ఒత్తిడి ఎదురవుతోంది. కాపురానికి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కాపురానికి వెళ్లడం తనకు ఇష్టం లేదంటూ యువతి చెబుతోంది. బాల్య వివాహం చెల్లందని గట్టిగా వాదిస్తోంది. కాపురానికి రావాలని లేదంటే పంచాయతీలో పరువు తీస్తామని అత్తంటివారు బెదిరింపులకు దిగారు.

దాంతో యువతి ఓ ట్రస్టు సాయంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. బాధిత యువతి పిటిషన్ మేరకు విచారించిన కోర్టు జడ్జి ఆమె భర్తకు సమన్లు జారీ చేశారు. బాల్య వివాహాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు జడ్జి పేర్కొన్నారు.