కాల్ చేస్తారు, స్వీటుగా మాట్లాడుతారు, మగ్గులోకి దించుతారు..సీన్ కట్ చేస్తే

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 01:26 PM IST
కాల్ చేస్తారు, స్వీటుగా మాట్లాడుతారు, మగ్గులోకి దించుతారు..సీన్ కట్ చేస్తే

హాయ్ అండి..అవతలి నుంచి స్వీట్ వాయిస్. మత్తుగా మాట్లాడుతారు. మాట్లాడుతూ..మగ్గులోకి దించుతారు.. వాళ్లు మాట్లాడిన మాటలు, వీడియోలు రహస్యంగా రికార్డు చేస్తారు. తర్వాత..అసలు సీన్ చూపిస్తారు. లక్షల్లో డబ్బులు దండుకుంటారు. ధనవంతులను, ప్రముఖ వ్యక్తుల పర్సనల్ వీడియోలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు.



ఓ మహిళతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో చోటు చేసుకుంది. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో వీరి ఆటలకు చెక్ పడింది. నిందితుల దగ్గరి నుంచి శివదాస్ పుర పోలీసులు రూ. లక్ష, దేశీయంగా తయారు చేసిన పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారిస్తున్నారు. గోవర్ధన్ విలాస్, రాజేంద్ర అలియాస్ రాజు, సోను గుజ్జర్, యోగేంద్రగా గుర్తించారు.
https://10tv.in/migrant-woman-with-coronavirus-gives-birth-on-board-a-helicopter-in-italy/
నిందితులు ధనవంతులు, ప్రముఖులను టార్గెట్ చేసే వారని పోలీసులు తెలిపారు. ధనవంతులు వివరాలను సేకరించి..ముఠాలోని మహిళా సభ్యులు పురుషులతో మాట్లాడి..వారు మాట్లాడిన మాటలను రహస్యంగా రికార్డు చేసేవారు.



వారిని ఓ చోటికి పిలిపించుకొనే వారు. డబ్బులు ఇవ్వాలని లేకపోతే…అత్యాచారం చేశారని..సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేస్తామని మహిళలు బెదిరించే వారు. హనీట్రాప్ ముఠాపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, పోలీసు కమిషనర్ మనోజ్ చౌదరి తెలిపారు. దౌసా జిల్లాలోని లాల్సోట్ లోని సావాసా గ్రామంలో వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు. కారు, పిస్టల్, గుర్తు తెలియని మందు బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు.