PM kisan Scheme: మీ ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమకాలేదా?.. ఈ ఐదు తప్పులు సరిచేసుకోండి
ఆర్థికంగా వెనుకబడిన చిన్నసన్నకారు రైతులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద అర్హతఉన్న ప్రతి రైతుకు ఏటా 6వేల రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు మూడు విడతల్లో 2వేలచొప్పున అందిస్తారు. ఈ పథకం కింద 11వ విడత నిధులను మే31న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విధితమే.

PM kisan Scheme: ఆర్థికంగా వెనుకబడిన చిన్నసన్నకారు రైతులకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద అర్హతఉన్న ప్రతి రైతుకు ఏటా 6వేల రూపాయలు అందజేస్తారు. ఈ డబ్బు మూడు విడతల్లో 2వేలచొప్పున అందిస్తారు. ఈ పథకం కింద 11వ విడత నిధులను మే31న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విధితమే. ప్రధాని మోదీ దాదాపు రూ. 21,000 కోట్ల మొత్తాన్ని 10 కోట్లకుపైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు బదిలీ చేశారు. అయితే పీఎం కిసాన్ పథకం నిధులు ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులకు చేరలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఆరాతీసిన పథకంపై స్పష్టమైన సమాచారం దొరక లేదు.
ఈ ఏడాది పీఎం కిసాన్ నిధులు రావాలంటే అర్హత కలిగిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ-కేవైసీ చేయించుకున్న రైతుల ఖాతాల్లోనే నగదు జమ అయింది. అయితే కొందరు లబ్ధిదారులకు ఈ-కేవైసీ చేయించుకున్నప్పటికీ ఖాతాల్లో నగదు జమ కాలేదు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి పీఎం కిసాన్ 11వ విడత నిధులు జమకాకపోవటానికి ఐదు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని సరిచేసుకుంటే అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.
– పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు లబ్ధిదారుడు పేరుకు సంబంధించి స్పెల్లింగ్ తప్పుగా నమోదు చేసినట్లయితే మీ భూమికి సంబంధించి పత్రాలు సరిపోలక నగదు నిలిచిపోయే అవకాశం ఉంది. పేరు నమోదు చేసే క్రమంలో తప్పనిసరిగా స్పెలింగ్ లో తప్పులు లేకుండా చూసుకోవాలి.
– లబ్ధిదారుడు అందించిన చిరునామా తప్పుగా ఉన్నట్లయితే, వెంటనే దానిని మీ పీఎం కిసాన్ ఖాతాలో సరిచేయాలి.
– ఆధార్ వివరాలను తప్పుగా నమోదు చేసినట్లయితే లబ్ధిదారుడు ఖాతాలోకి నగదు చేరదు. అర్హత కలిగిన రైతులు తిరిగి ఆధార్ వివరాలు తప్పులు లేకుండా నమోదు చేస్తే నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది.
– అసంపూర్తిగా ఉన్న e-KYC వల్ల కూడా మీ ఖాతాలోకి నగదు జమ కాకపోవటానికి కారణంగా చెప్పవచ్చు.
– లబ్ధిదారుడు e-KYCని పూర్తి చేయడానికి చివరి తేదీ గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. మే31 నుండి జూలై31వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
- PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..
- PAN Bank Rules : పాన్ ఉండాల్సిందే.. రూ.20 లక్షల డిపాజిట్, విత్డ్రాకు కొత్త రూల్స్..!
- UIDAI Scam: భారీ ఆధార్ స్కామ్: రూ.13 వేల కోట్లకుపైగా కేంద్రానికి నష్ఠం
- PAN-Aadhaar Linking : 31 లాస్ట్ డేట్.. ఆ తర్వాత రూ.10 వేలు జరిమానా..!
- Invitation Wedding card : అతనిచ్చిన వెడ్డింగ్ కార్డ్ చూసి షాక్ అవుతున్న బంధువులు..
1Karnataka Bus: కర్ణాటక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం
2imran murder : హత్యకు కుట్ర అంటూ ఆరోపణలు..ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
3Tollywood : తెలుగు వారికి మరింత దగ్గరవుతున్న కన్నడ, మలయాళం స్టార్లు..
4Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు
5Secunderabad protests: సికింద్రాబాద్ అల్లర్లు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సుబ్బారావు
6Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం
7Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?
8Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..
9US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం
10Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
-
T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
-
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు