Russia – India: రష్యాకు ఎగుమతులు పునరుద్ధరించిన భారత్: ఇరు దేశాల కరెన్సీతోనే చెల్లింపులు

రష్యాకు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది భారత్ టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్‌లు రష్యాకు తరలి వెళ్తున్నయి.

Russia – India: రష్యాకు ఎగుమతులు పునరుద్ధరించిన భారత్: ఇరు దేశాల కరెన్సీతోనే చెల్లింపులు

Russia

Russia – India: రష్యా యుక్రెయిన్ యుద్ధం 50 రోజులుగా కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ లోని అతిముఖ్యమైన పట్టణం మరియోపోల్ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇక డాన్ బాస్ ప్రాంతాన్ని చేజిక్కిచుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. డాన్ బాస్ కోసం యుక్రెయిన్ సైన్యం ప్రాణాలకు తెగించి ప్రతిఘటిస్తుంది. తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో రష్యా యుక్రెయిన్ సేనల మధ్య భీకర పోరాటం కొనసాగుతుంది. ఓ వైపు యుద్ధాన్ని కొనసాగిస్తూనే మరోవైపు దేశంలో పరిపాలనను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది రష్యా. ప్రస్తుతం భారత్ తో మాత్రమే సఖ్యతను పాటిస్తున్న రష్యా ఆమేరకు భారత్ నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడింది. రష్యాకు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది భారత్.

Also read:Twitter Edit Tweet : ట్విట్టర్‌లో ఎడిట్ బటన్.. మీ ట్వీట్ ఎన్నిసార్లు ఎడిట్ చేశారో తెలిసిపోతుంది.. జాగ్రత్త..!

టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్‌లు రష్యాకు తరలి వెళ్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత వారం రోజులుగా భారత్ నుంచి ఈ ఉత్పత్తులు జార్జియా పోర్టు మీదుగా రష్యాకు ఎగుమతి అవుతున్నట్లు తెలిసింది. రష్యాలోని అతిపెద్ద రుణదాత అయిన స్బేర్‌బ్యాంక్ సహకారంతో రష్యా బ్యాంకులే ఈ దిగుమతుల చెల్లింపులు చేస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ మరియు CEO అజయ్ సహాయ్ వెల్లడించారు. 22,000 కిలోల బరువు గల 60 కంటైనర్లలో సాధారణ బియ్యాన్ని(Non Basmati) ఇటీవలే భారత్ నుంచి రష్యాకు ఎగుమతి చేసినట్లు షా నంజీ నాగ్జీ ఎక్స్‌పోర్ట్స్ డైరెక్టర్ అశ్విన్ షా వెల్లడించారు.

Also read:Guinness World Record : ఇతడికి సినిమా అంటే పిచ్చి.. ‘స్పైడర్ మ్యాన్’ ఏకంగా 292 సార్లు చూశాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు

ఇందుకుగానూ రష్యాకు చెందిన ఆల్ఫా బ్యాంకు..తమకు చెల్లింపులు చేసిందని అశ్విన్ షా పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై అంతర్జాతీయ వాణిజ్య సమాఖ్య ఆంక్షల ఫలితంగా..ఆదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ సంస్థలు మూతపడనున్నాయి. విదేశీ సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తే సుమారు 2 లక్షల మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని మాస్కో నగర మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు సిటీ మేయర్ 41 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించారు.

Also read:African Swine Flu : త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ కలకలం..!