గొర్రెల కాపరికి కరోనా.. క్వారంటైన్‌కు మేకలు, గొర్రెలు

గొర్రెల కాపరికి కరోనా.. క్వారంటైన్‌కు మేకలు, గొర్రెలు

గొర్రెల కాపరికి కరోనా వస్తే మేకలు, గొర్రెలు కూడా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. గోడెకరె గ్రామంలో కాపరికి కరోనా వచ్చిందని తెలిసి గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడని జంతుసంబంధిత శాఖ అధికారి వెల్లడించారు.

‘కొన్ని జంతువులకు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రతి చోటా కరోనా భయం చుట్టుముడుతుంది. ప్రజలు కరోనా పశువుల వల్ల వస్తుందేమోనని భయపడుతున్నారు’ అని అధికారి వెల్లడించారు. గ్రామస్థులంతా కలిసి కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ అఫైర్స్ మినిష్టర్ జేసీ మధుస్వామి తుమకూరు జిల్లా అధికారి అన్నారు.

జిల్లా కమిషనర్ కే రాకేశ్ కుమార్ దీనిపై విచారణ జరిపారు. సంబంధిత అధికారులను తీసుకుని గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. వెటర్నరీ నిపుణులు పెస్టె డెస్ పేటిస్ ర్యూమినంట్స్ తో బాధపడుతున్నాయని అన్నారు. జంతువుల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి భోపాల్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ ల్యాబొరేటరికి పంపారు. ఫలితాల్లో గొర్రెలు, మేకల్లో COVID-19 నెగెటివ్ వచ్చింది.