Live-In Relationship: సహ జీవనంపై క్లారిటీ ఇచ్చిన హైకోర్టు

తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు.

Live-In Relationship: సహ జీవనంపై క్లారిటీ ఇచ్చిన హైకోర్టు

Live In Relation

Live-In Relationship: తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. దానిని నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన విషయం కాదని పంజాబ్ అండ్ హర్యానా హై కోర్టు కొట్టేసారేసింది.

పిటిషనర్లు 19ఏళ్ల గుల్జా కుమారీ, 22ఏళ్ల గుర్వీందర్ సింగ్ కలిసి ఉంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అందులో తెలిపారు. అమ్మాయి కుటుంబం తరపు నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతమున్న విషయానికొస్తే.. పిటిషన్ లో సహజీవనానికి అప్రూవల్ అడుగుతున్నట్లుగా ఉంది. అది నైతికంగా, సామాజికంగా ఆమోదించాల్సిన విషయం కాదు. పిటిషన్ లో ప్రొటెక్షన్ కల్పించాలని ఎక్కడా లేదు. దానిని బట్టే పిటిషన్ ను కొట్టేశాం’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ మే11న వెల్లడించారు.

పిటిషనర్ కౌన్సిల్ ను బట్టి జేఎస్ ఠాకూర్, సింగ్, కుమారీలు తార్న్ తరణ్ జిల్లాలో ఉంటున్నారు. కుమారి పేరెంట్లు లుధియానాలో ఉంటుననారు. వారిద్దరూ కలిసి ఉండటాన్ని వాళ్లు ఒప్పుకోలేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏవీ ఇవ్వకపోగా వయస్సుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అందించలేకపోయింది ఆ జంట.