వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 12:37 PM IST
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ముంబై, ఢిల్లీలో ధరలు పెంచారు. సబ్సిడీ సిలిండర్ పై ఢిల్లీలో 28పైసలు, ముంబైలో 29పైసలు పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై రూ.6 పెరిగింది. మే 1 2019 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ధరల పెంపు తర్వాత నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.712.5 అయ్యింది. కోల్ కతాలో రూ.738.5, ముంబైలో రూ.684.5, చెన్నైలో రూ.728 అయ్యింది.

సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.496.14, కోల్ కతాలో రూ.499.29, ముంబైలో రూ.493.86, చెన్నైలో రూ.484.02 అయ్యింది. ప్రస్తుతం ఏడాదికి సబ్సిడీ ధర కింద 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. 12 దాటితే మార్కెట్ ధర ప్రకారం కొనుక్కోవాలి.
Also Read : SBI కొత్త రూల్ : సేవింగ్స్ ఖాతాలో నిల్వలపై వడ్డీ తగ్గింపు